అమరావతి : కడప జిల్లాలో ఘోరం జరిగింది. గుర్తు తెలియని మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. రాయచోటి మండలంలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఒక మహిళ, ఇద్దరు పురుషుల మృతదేహాలు లభ్యం కావడం గ్రామంలో కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
వీరు వారం రోజుల క్రితం మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిది హత్య లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.