హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ముస్లిం మైనారిటీలపై ఏపీలోని జగన్ సర్కార్ వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీలను అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సీఎం జగన్మోహన్రెడ్డి మోసం చేశారని విమర్శించారు.
బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముస్లిం మైనారిటీ పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో 20 లక్షలకుపైగా ఉన్న దూదేకుల కులస్తులు మైనారిటీల్లో అంతర్భాగమని తోట చంద్రశేఖర్ తెలిపారు. పేద ముస్లింలకు అందుతున్న ప్రభుత్వ పథకాలను దూదేకులకూ వర్తింజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆలమూరు రఫీ తదితరులు పాల్గొన్నారు.