హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ-పుష్పవల్లి దంపతులను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆశీర్వదించారు. విజయవాడలో ఆదివారం వారి పెండ్లి జరుగగా, తోట హాజరయ్యారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన రంగా తనయుడు ఓ ఇంటివాడు కావడం సంతోషంగా ఉన్నదని తోట ఆనందం వ్యక్తం చేశారు.