తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 354 లాట్ల వస్త్రాలను జనవరి 17 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇందులో సిల్క్, పాలిస్టర్ నైలాన్ / నైలెక్స్, ఆర్ట్ సిల్క్, ఓణీలు, బ్లౌజ్పీస్లు కొత్తవి, వినియోగించిన వస్త్రాలున్నాయని తెలిపారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని, 0877-2264429 నంబరును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in / www,tirumala.org ను సంప్రదించాలని సూచించారు.