తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శని, ఆదివారాల్లో జరుగనున్న గజ, గరుడ వాహనసేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని శనివారం ఆలయ నాలుగు వీధుల్లో ఊరేగించారు. తిరుచానూరుకు ప్రత్యేక వాహనంలో భద్రత నడుమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి టీటీడీ జేఈవో వీరబ్రహ్మంకు అందజేశారు. హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఆగమ సలహాదారు , కంకణబట్టార్ శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.