అమరావతి : ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల (BJP Candidates) పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తుల్లో భాగంగా బీజేపీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇందులో భాగంగా బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటించిన 5వ విడత జాబితాలో ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది .
బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి(Purandeshwari) రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తున్నారు. నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, అరకు నుంచి కొత్తపల్లి గీత(Kottapalli Geeta) , అనకాపల్లి నుంచి సీఎం రమేశ్ పోటీ చేస్తారని అధిష్టానం వెల్లడించింది. అయితే అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఇంకా వెల్లడించలేదు.