అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొంత మంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని , శ్రీలంక పరిస్థితులు నెలకొన్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ తెలిపారు.పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. రాష్ట్రం లో ఆర్థికవ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదని అన్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని ఉద్ఘాటించారు.
కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసిందని తెలిపారు. చంద్రబాబుతో పాటు ఆయన బ్యాచ్ దోచుకో..దాచుకో..పంచుకో అన్న రీతిలో దొంగల ముఠాల వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయని ఎద్దేవాచేశారు. జీడీపీ గ్రోత్రేట్లో గత మూడేళ్లుగా ఏపీ తొలి మూడు, నాలుగు స్థానాల్లోనే ఉందని పేర్కొన్నారు.