తిరుపతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan ) ఆంధ్రప్రదేశ్లో వివిధ రాజకీయ పార్టీల తీరుపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ (Congress) చెత్త రాజకీయాలకు(Worst politics) పాల్పడుతుందని, కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. తిరుపతిలో బుధవారం ఇండియా టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సుకు హాజరై మాట్లాడారు. జాతీయ పార్టీలకు (National Partys) ఏపీలో చోటులేదని వెల్లడించారు.
నాడు ‘ బాబాయ్ వివేనందా రెడ్డిని నాపై పోటికి దింపారు. నేడు మరోసారి మా సోదరిని ప్రయోగించారు. దేవుడే వాళ్లకు బుద్ధి చెబుతాడని’ అన్నారు.విభజించి పాలించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతోనే తమకు పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీలో అభ్యర్థుల మార్పులు, చేర్పులపై స్పందిస్తూ సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇస్తున్నామని వెల్లడించారు.
ప్రజావ్యతిరేకత ఉన్న వారికి ‘నో’ అని కచ్ఛితంగా చెబుతున్నామని వివరించారు. చివరిక్షణంలో అభ్యర్థులను మార్చడం కంటే ముందుగానే నిర్ణయం తీసుకోవడం వల్ల స్థానిక పరిస్థితులు అనుకూలిస్తాయని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
చంద్రబాబు అవినీతి నిరూపితమైంది..
చంద్రబాబు( Chandra Babu) ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పాల్పడ్డ అవినీతి వివిధ స్థాయిలో నిరూపితం కావడంతోనే అతడిని పోలీసులు అరెస్టు చేశారని జగన్ అన్నారు. ఇందులో కక్షపూరిత రాజకీయాలు లేవని వెల్లడించారు. సీఐడీని దుర్వినియోగం చేశామన్నది అర్థరహితమని తెలిపారు.