తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లుల నడుమ పుష్పపల్లకీ సేవ సాగింది. ఆరు రకాల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల కట్ ప్లవర్లు కలిపి దాదాపు ఒక టన్ను పుష్పాలతో హంస ఆకారంలో పల్లకీని అలంకరించారు.
పల్లకీ ముందు వైపు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మధ్య భాగంలో చిన్నికృష్ణుడు, వెనుకవైపు బాల ఆంజనేయస్వామివారి ఆకృతులను రూపొందించారు. 15 మంది అలంకార నిపుణులు 3 రోజుల పాటు శ్రమించి ఈ పుష్ప పల్లకీని తయారుచేశారు. కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవీ ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్బాబు, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తాం