అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. టీడీపీ నేత రామ సుబ్బారావు ఇంట్లోకి ఆరుగురు దొంగలు చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మూడు ఏటీఎం కార్డులు, సెల్ఫోన్లు లాక్కున్న దొంగలు ఏటీఎం పిన్ నెంబర్లను సైతం తీసుకున్నారు. 14 సవర్ల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి పారిపోయారు
. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.