అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి శంకర నారాయణకు గ్రామస్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడప కార్యాక్రమంలో భాగంగా జిల్లాలోని పెనుగొండ మండలం శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాలో మాజీ మంత్రి పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఓ ఇంటి వద్దకు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలను వివరస్తున్న శంకరనారాయణను ఓ మహిళ నిలదీసింది. 11 నెలలుగా అధికారులు తన పింఛన్ను నిలిపివేశారని , కారణం తెలియడం లేదని లలితాబాయి అనే మహిళా నిలదీశారు. తనకు ఇల్లు మంజూరు చేయాలని మరో మహిళ ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తుండగానే మాజీ మంత్రి అక్కడి నుంచి బయలు దేరారు. దీంతో ఆగ్రహించిన మహిళలు కనీసం నిలబడి తమ సమస్యలు వినలేరా అని నిలదీశారు.