అమరావతి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిరుద్యోగ యువత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ పార్టీ తరుఫున నిర్వహించిన జాబ్మేళాను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కాకుండా అందివచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరికి విద్య ఎంత అవసరమో ఉద్యోగం కూడా అంతే అవసరమని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని ఆయన వెల్లడించారు. మహిళా సాధికారత కోసం ఏప సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఒక్కసారి ప్రయత్నించి ఉద్యోగం రాకపోతే నిరాశకు గురికావద్దని జాబ్ మేళా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.