అమరావతి : మాజీ డ్రైవర్ హత్యకేసులో రిమాండ్లో ఉన్న కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ ఈనెల 13కి వాయిదా వేశారు. అతడిని పోలీసులు కస్టడీ పిటిషన్పై రాజమండ్రి కోర్టులో విచారణ కొనసాగుతుంది. దీంతో ఎమ్మెల్సీకి చెందిన న్యాయవాది బెయిల్ పిటిషన్పై వారంరోజుల క్రితం దరఖాస్తు చేసుకోగాబెయిల్ ను కోర్టు తిరస్కరించింది. మరోసారి బెయిల్కు దరఖాస్తు చేసుకోవడంతో విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో గత నెల 23న అనంతబాబు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని, అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని రాష్ట్రంలో ప్రధాన పక్షమైన టీడీపీతో పాటు వామపక్షాలు, ప్రజా, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించాయి. దీంతో ఆలస్యంగానైనా స్పందించిన వైసీపీ ప్రభుత్వం అతడిని అరెస్టు చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.