అమరావతి : ఏపీలో కర్నూలు జిల్లాలో జింకలను దుండగులు కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. ఆధోని మండలం నారాయణపురం వద్ద స్థానికులకు 10 జింకల కళేబరాలు కనిపించాయి. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దుండగులను పట్టుకునేందుకు ఆదోని సరిహద్దు తో పాటు చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. దుండగులు ఎవరనేది వాకబు చేస్తున్నారు.