అమరావతి : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు (Chandra Babu) ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా పడింది. బుధవారం సుప్రీం కోర్టు (Supreme Court ) లో విచారణ రాగా ఈరోజు విచారణ బెంచ్ కూర్చోవడం లేదని , విచారణకు మరో తేదీని వెల్లడిస్తామని కేసును విచారిస్తున్న జస్టిస్ అనిరుద్ధ బోస్(Justice Aniruddh Bose) వెల్లడించారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు కోర్టు కేసుల్లో బిజీ ఉన్నందున ఈ రోజు బెంచ్ కూర్చోవడం లేదని తెలిపారు.
ఫైబర్ నెట్ కేసు(Fiber Net Case) లో తన అనుకూల వర్గానికి కాంట్రాక్ట్ ఇచ్చారని, వందల కోట్ల రూపాయల కుంభకోనం జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు పరిశీలించి ముందస్తు బెయిల్ను నిరాకరించింది. దీంతో చంద్రబాబు హైకోర్టు తీర్పును( High Court Decision) సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలాఎం త్రివేదీల ధర్మాసనం విచారణ జరుగవలసి ఉండగా విచారణను వాయిదా వేసింది.