అమరావతి : కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆంధ్రప్రదేశ్లో కంటి ఆస్పత్రి నిర్మాణానికి భారీ విరాళమిచ్చి ఉదారతను చాటుకున్నాడు. తన తండ్రి సుభాష్రెడ్డి స్వగ్రామమైన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం గ్రామంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిర్మాణానికి ప్రశాంత్ నీల్ రూ. 50లక్షల విరాళాన్ని ప్రకటించాడు.
మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడైన సుభాష్రెడ్డి తనయుడు ప్రశాంత్ నీల్ పుట్టి పెరిగింది బెంగుళూరులో నైనా అతని స్వగ్రామం అనంతపురం జిల్లా నీలకంఠాపురం. అందుకే తనపేరులో చివరన నీల్గా పెట్టుకున్నా డు. ఇటీవల తండ్రి చనిపోవడంతో నీలకంఠాపురంలోనే ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. తండ్రి జ్ఞాపకార్ధం తరుచూ గ్రామానికి వస్తున్న ప్రశాంత్ నిన్న తండ్రి 75వ జయంతి సందర్భంగా గ్రామంలో నిర్వహించిన పలు స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్నాడు.