అమరావతి : ఉన్మాదుల చేతుల్లో బంధుత్వాలు బలైపోతున్నాయి. కనీపెంచినా తల్లిదండ్రులపై కనికరం
లేకుండా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చంటిపాపల్లా కాపాడాల్సిన ఓ తనయుడు ఉన్మాదిలా మారి ఆమె గొంతుకోసి హత్య చేయడం పల్నాడు జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లాలోని చిలకలూరిపేట మండలం రాజాపేటలో జరిగిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తల్లి ఆదిశేషమ్మ(67)ను కుమారుడు వీరయ్య ఇవాళ తెల్లవారుజామున ఓగేరు వాగు వద్ద బ్లేడుతో గొంతుకోసి అక్కడే వదిలేసి పారిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను గమనించిన స్థానికులు 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం హుటాహుటినా గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్సపొందుతూ మృతి చెందింది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. తల్లిని చంపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు