అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోడుమూరులో దారుణం జరిగింది. గతంలో తల్లిని చంపాడన్న కోపంతో కొడుకు బ్రహ్మ ఇవాళ తండ్రి పుల్లయ్యపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడి కక్కడే కుప్పకూలి కిందపడిపోయాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. కాగా కొన్ని నెలల క్రితం భార్యను చంపిన కేసులో పుల్లయ్యను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఐదు రోజుల కిందట జైలు నుంచి పుల్లయ్య ఇంటికి వచ్చాడు.
అయితే తల్లిని చంపి తనను ఒంటరిగా చేశాడనే కక్షతో కొడుకు బ్రహ్మ అదును చేసి ఈరోజు తండ్రిపై కత్తితో దాచి చేసి చంపి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. బ్రహ్మ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.