అమరావతి : సరదాగా ఆడిన పందెంతో ఒకరి ప్రాణం పోయిన ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది. టెక్కలిలో యర్ర ఈశ్వరరావు అనే పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారి పచ్చి పందిమాంసం కోసం దుకాణానికి వెళ్లాడు. అక్కడ కోసిన పంది మాంసం ముక్కను నోట్లో వేసుకోగా అక్కడికి వచ్చిన అతని స్నేహితులు మరో ముక్క తినాలని పందెం కాశారు.
దీంతో ఈశ్వరరావు ముక్కను నోట్లో వేసుకోగానే ఆ ముక్క గొంతుకు అడ్డం పడి ఊపిరాడక కిందపడి కొట్టుకున్నాడు. ఆందోళన చెందిన అతని స్నేహితులు అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడికి భార్య, కుమారులు ఉన్నారు.