తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలువల కారణంగా తిరుమల (Tirumala ) పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం మినహ గణతంత్య్ర దినోత్సవంతో(Republic day) పాటు ఆదివారం వరుస సెలవులు రావడంతో వేంకటేశ్వర స్వామిని (Venkateshwar) దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 24 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 71,664 మంది దర్శించుకోగా 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని తెలిపారు.