అమరావతి: జనసేన అధినేత పవన్కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం( Pithapuram) అసెంబ్లీ స్థానానికి రూట్ క్లియర్ అయ్యింది, కూటమిలో భాగంగా జనసేనకు ఈ సీటు ఖరారు కాగా తనకే ఇవ్వాలంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ (Former MLA Varma) టీడీపీ నిర్ణయంపై అసంతప్తిని వ్యక్తం చేశారు. పవన్ పోటీ చేస్తే తానూ పోటీ చేస్తానని హెచ్చరించిన వర్మ శనివారం చంద్రబాబుతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu ) వర్మ సేవలను కొనియాడుతూ రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా తొలి అవకాశం నీకే ఇస్తానని హామీ ఇవ్వడంతో వర్మ శాంతించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో పవన్కల్యాణ్ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ కోసం కొన్ని సార్లు త్యాగాలు తప్పవని అయన అన్నారు. నాకు మొదటిదశలోనే ఎమ్మెల్సీ ఇస్తామని బాబు హామీ ఇచ్చారని వెల్లడించారు. నియోజకవర్గంలోని పురుషోత్తపట్నం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబును కోరినట్లు ఆయన వివరించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్కల్యాణ్ ప్రకటన వెలువడే గానే పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు దహనం చేశారు. రోడ్లపై బైటాయించి పవన్, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.