అమరావతి : పీఆర్సీపై ఎంతో ఆశతో ఉన్నాం..కాని నిరాశే ఎదురైంది.అయినా ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడవు ఇస్తున్నాం. సానుకూల నిర్ణయం రాకపోతే ఉద్యమ బాట తప్పదని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి మరోమారు హెచ్చరించారు. పీఆర్సీపై, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం చర్చల్లో చెప్పలేదని ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తుందని ఆయన విమర్శించారు.
ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఒక్కరోజూ ఆలస్యం చేయకుండా పీఆర్సీని ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటిని పరిష్కరించలేదని అన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఏపీలో ఆరోగ్య కార్డులు అనార్యోగకార్డులుగా మారాయని పేర్నొన్నారు. ప్రభుత్వం ఆ నెలాఖరు వరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 27 లోపు ఏపీ ఎన్జీవో సంఘం, 28న ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతితో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.