హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఆలయంపై ఓ విమానం తిరుగుతూ కెమెరాలకు చిక్కింది. ఇటీవల ఆలయంపై తరచూ విమానాలు తిరుగుతున్నాయి.
ఆలయంపై విమానాల తిరగడం ఆగమశాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని టీటీడీ చెబుతున్నది. నో ైప్లెయింగ్ జోన్గా తిరుమల ప్రకటించాలని అనేకసార్లు టీటీడీ కోరినా, కేంద్ర విమానయాన శాఖ నేటికీ స్పందించలేదు. టీటీడీ తాజా ఘటనపై అధికారులను సమాచారం కోరింది. అధికార యంత్రాంగం స్పందించి తిరుమల ఆలయ సమీపంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.