అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. తాజాగా మరో ఇద్దరు న్యాయమూర్తులను ( Judges ) నియమించడంతో ఆ సంఖ్య 28 నుంచి 30కు చేరుకుంది. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ (Avadhanam Hariharanatha Sharma) , డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును (Yadavalli Lakshmana Rao) నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ ఇద్దరు శుక్రవారం అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశంముంది.
రాష్ట్ర హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 28 మంది పనిచేస్తున్నారు. ఇద్దరి నియమకంతో ఆ సంఖ్య 30కు చేరుకోగా మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. . వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా , ఆతరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. న్యాయాధికారుల కోటా నుంచి వీరి పేర్లను సుప్రీంకోర్టు(Supreme Court) సీజే నేతృత్వంలోని కొలీజియం సిఫారస్ చేస్తూ ఈనెల 11న తీర్మానం చేసింది.