అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికార వైసీపీ తమ ఎమ్మెల్యేల కోటాలో అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన విక్రాంత్, కర్నూలుకు చెందిన ఇషాక్ బాషా పేర్లను ఖరారు చేసినట్లు తెలిపారు.
మరో రెండురోజుల్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.