అమరావతి : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరో చారిత్రక కట్టడిపై సంచలన కామెంట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ పేరును కూడా మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ హాస్పిటల్కు తెన్నేటి విశ్వనాథం పేరును లేదా గౌతు లచ్చన్న పేరును పెట్టాలని సూచించారు. ప్రకాశం బ్యారెజ్ పేరుపై కూడా స్పందించిన ఆయన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతానని అంటూనే బ్యారేజ్ నిర్మాణంలో కాటన్తో పాటు వీరం వీరన్న అనే మరో ఇంజినీర్ కూడా ప్రధాన పోషించారని అతడి పేరును కూడా పెట్టాలని పేర్కొన్నారు.
గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ పేరును మార్చాలని మరోసారి ప్రభుత్వానికి సూచించారు. లేదంటే 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే జిన్నా టవర్ పేరును మార్చుతామని సోము వీర్రాజు అన్నారు. తాను చేస్తున్న ప్రతి మాటాను తమ మ్యానిఫెస్టోలో పెడతామని వెల్లడించారు. ఏపీలో ప్రతి సమస్యకు బీజేపీ దగ్గర పరిష్కారం ఉందని వివరించారు.