తిరుమల : తిరుమలలో భక్తుడి హత్య కలకలంరేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం మ్యూజియం వద్ద బుధవారం అర్థరాత్రి ఘటన జరిగినట్లు గుర్తించారు. ఆ తరువాత పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా నిద్రిస్తున్న అతడిపై బండరాయితో గుర్తు తెలియని వ్యక్తి మోది హత్య చేశాడు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 2 గంటల వ్యవధిలో వన్ టౌన్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. మృతుడు తమిళనాడుకు చెందిన భాస్కర్గా గుర్తించారు. హత్యకు పాల్పడిన కందస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.