అమరావతి : కడప జిల్లాలో దారుణం జరిగింది. అభం-శుభం తెలియని పదేళ్ల బాలుడిని స్వయాన మేనత్త, మేనమామ కొట్టి చంపారు. అయాన్ అనే బాలుడిని తల్లిదండ్రులు గల్ఫ్కు వెళ్తూ మేనత్త, మేనమామ వద్ద వదిలి వెళ్లారు. అల్లరి చేస్తున్నాడని అయాన్ను విపరీతంగా కొట్టడంతో స్పృహతప్పిపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోగా ఇద్దరు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.