అమరావతి : రాబోయే ఎన్నికలకు గాను అభ్యర్థులను, పార్టీ నాయకులను సన్నద్ధం చేయడానికి వైసీపీ(YCP) కసరత్తులో భాగంగా ఇన్చార్జిల పేర్లను బుధవారం రాత్రి 5వ జాబితా(LIst) ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు 7 నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తల పేర్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అరుకువేలీ(Arukuveli) నియోజకవర్గానికి రేగం మత్స్యలింగం, కాకినాడ పార్లమెంట్(Kakinada Parliament ) నియోజకవర్గానికి చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి సింహాద్రి రమేశ్బాబు ను ఇన్చార్జిలుగా ప్రకటించారు. ఆవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్రావు, నర్సారావుపేట (ఎంపీ) పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, సత్యవేడు నియోజకవర్గానికి నూకతోటి రాజేశ్, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా మద్దిల గురుమూర్తి పేర్లను ప్రకటించారు.