తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. గత నవంబర్ నెలలో శ్రీవారిని 20.77 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా వీరిలో 8.91 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా నవంబర్ నెల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 127.31 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
మూడు లక్షల లడ్డూలు విక్రయం జరిగిందని పేర్కొన్నారు. శనివారం టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 64,586 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు వచ్చిందని తెలిపారు.