అమరావతి : ఏపీలో టీడీపీ, జనసేన కూటమి(TDP and Jana Sena) పార్టీలు అధికారంలోకి రానున్నాయని సినీనటుడు పృథ్వీరాజ్ (Prithviraj ) అన్నారు. మరో వంద రోజుల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇవ్వానున్నారని జోస్యం చెప్పారు. కూటమికి 135 ఎమ్మెల్యే, 21 ఎంపీ స్థానాలు రాబోతున్నాయని ధీమాను వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీకే రిపోర్టులు(PK reports) , లగడపాటి రిపోర్టులు నమ్ముతారు కాని పీఆర్ (పృథ్వీరాజ్) రిపోర్టు నమ్మరా అని అన్నారు.
వచ్చే 175 సీట్లు గెలుపొందుతామన్న వైసీపీ నాయకులు నేడు భయపడుతున్నారని పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తాను శ్రీకాకుళం నుంచి శ్రీశైలం వరకు రథయాత్ర ద్వారా వైసీపీ నాయకుల బండారాన్ని భయటపెడుతానని వెల్లడించారు. బూతులు మాట్లాడే మంత్రులు, వారి సమూహం కుప్పకూలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరుగలేదని ఆరోపించారు. రాబోయే ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తాయని పేర్కొన్నారు.