తిరుమల: తిరుమలలోని శ్రీవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆలయానికి చేరుకున్న దత్తాత్రేయకు ఆలయ ఈవో ధర్మారెడ్డి , ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం గవర్నర్ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు, టీటీడీ ముద్రించిన క్యాలెండర్ను, ఫొటోను అందజేశారు.
నిన్న శ్రీవారిని 76,407 మంది భక్తులు దర్శించుకోగా 39,938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. వారంతపు సెలవు దినాలు కావడంతో ఇవాళ అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. స్వామి వారి దర్శనానికి 9 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.