అమరావతి : సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలనేదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హీరో నాని ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై చేసిన వ్యాఖ్యలకు బొత్స స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా థియేటర్లలల్లో సౌకర్యాల ప్రకారం టికెట్ ధర ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. వినోదం అందని వస్తువులా ఉండకూడదని పేర్కొన్నారు. సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అనుకుంటే అధికారులను, ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని సూచించారు.
కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలను విపరీతంగా పెంచడం ధర్మమా అని ప్రశ్నించారు. టికెట్ ధరలపై పెంపుపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్లో ఏదైనా వస్తువు కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా.. సినిమా టికెట్లకు కూడా ఎమ్మార్పీ ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని బొత్స అన్నారు.