అమరావతి : ప్రభుత్వానికి జీతాలు తగ్గించే హక్కు ఉందని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఏపీలో పీఆర్సీ జీవోలో సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టులో ఈరోజు విచారణ ప్రారంభమైంది. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని , సెక్షన్ 78/1 కి విరుద్ధంగా ఉన్న జీవో 1 రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరుఫున రవితేజ అనే న్యాయవాది వాధించారు.
పీఆర్సీ నివేదిక పబ్లిక్ డోమైన్లో ఎక్కడా పెట్టలేదని ఆయన కోర్టుకు వివరించారు. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించడం చట్ట విరుద్ధమని పేర్కొనగా హైకోర్టు స్పందించి కీలక వ్యాఖ్యలు చేసింది. జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని, ఉద్యోగులకు పీఆర్సీ పెరిగిందా లేదా అనే విషయాన్ని, అంకెల్లో జీతం పెరిగిందా లేదా అని చెప్పాలని సూచించింది. మరో వైపు ఉద్యోగుల గ్రాస్ జీతాలు పెరిగాయని లెక్కలతో ఏజీ కోర్టుకు సమర్పించారు. పీఆర్సీ నివేదిక బయటకు రాకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలని వ్యాఖ్యనించింది.
పర్సంటేజీని ఛాలెంజ్ చేసే హక్కు మీకు లేదు, వేసిన పిటిషన్లో లీగల్ శాంటిటి లేదని తేల్చి చెప్పింది. సమ్మెకు వెళ్లామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా బెదిరిస్తారని, బెదిరించడమే కాకుండా రిట్ పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించింది.