అమరావతి : ఆంధ్రప్రదేశలో కొత్త జిల్లాల కసరత్తు పూర్తయిందని, ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టమని అన్నారు. రాష్ట్రంలో వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ కేంద్రాలను బేస్ చేసుకుని జిల్లాల విభజన చేపట్టామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందని అన్నారు.
చిన్నచిన్న మార్పులతోనే తుది నోటిఫికేషన్ వెలువడనుందని సజ్జల వివరించారు. 2023 నాటికి మొత్తం కొత్త జిల్లాలకు శాశ్వత భవనాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని ఆయన అన్నారు. డెడ్లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కానీ ఆదేశాలు కాబట్టే సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారని వెల్లడించారు.