అమరావతి : తిరుమల మెట్లదారిలో బాలికను పొట్టను పెట్టుకున్న చిరుత(Leopard)ను ఏడు నెలల అనంతరం అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత ఏడాది ఆగస్టు 21న నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన ఓ కుటుంబం అలిపిరి కాలినడక(Alipiri Steps) మార్గంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరుమల బయలు దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల కంటే ముందు ఆరేళ్ల బాలిక లక్షిత (Lakshita) నడిచి వెళుతున్న ఆమె పై ఒక్కసారి చిరుత పులి దాడి చేసి అటవిలోకి లాక్కెళ్లింది.
కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదే రోజు రాత్రి పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడం ఆమె ఆచూకి లభించలేదు. మరుసటి రోజు కొంత దూరంలో బాలిక మృతదేహం కనిపించింది. ఈ ఘటన జరిగిన తరువాత టీటీడీ భద్రత చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా నెలరోజుల వ్యవధిలో నాలుగు చిరుతలో బోనులో చిక్కాయి.
చిక్కిన వాటిలో ఏ చిరుత బాలిక లక్షితను చంపింది అనే కోణంలో అధికారులు శాంపుల్స్ను సేకరించారు. దాదారు నెలల తరువాత వచ్చిన నివేదిక ఆధారంగా బోనులో చిక్కిన నాలుగో చిరుత లక్షితను చంపిందని ఈరోజు గుర్తించారు.