అమరావతి : తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వర్షం కారణంగా జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది . ఎగువ నుంచి సోమశిలకు 27 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది . ఈ జలాశయం నుంచి పెన్నా ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమశిల జలాశయం పూర్తి నీటి నిల్వ 77.98 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 69 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరులో నది దాటేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నది ప్రవాహానికి కొట్టుకుపోయిన యువకుడిని స్థానికులు కాపాడారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాల కారణంగా పెట్టుబడి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకొచ్చిన వరి నీట మునడంతోపాటు ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది, పతి, మిరప, సెనగ, పొగాకు , మినుముతో పాటు ఉద్యాన పంటలకూ భారీనష్టం వాటిల్లింది.