అమరావతి : విశాఖ ఉక్కు కర్మాగారం ప్లాంట్( Visakha Incident ) లో ఎంసీఎంఎస్-2, ఎస్టీసీ-3లో హీట్ ఎఫ్జీలో 1500 డిగ్రీల వేడి కలిగిన మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఐదుగురు ఉద్యోగులు ( Employees ) , ముగ్గురు ఒప్పంద కార్మికులు( Contract workers ) మృతి చెందారు.
మృతి చెందిన వారిలో అప్పారావు, ప్రభాకర్రావు, కృష్ణ, రమణ, త్రినాథ్, అప్పలరాజు, కుమార్ , మరో వ్యక్తి ఉన్నట్లు ప్లాంట్ యాజమాన్యం వెల్లడించింది. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమం ఉందని తెలిపారు. ప్లాంట్లో ఎంసీఎంఎస్-2, ఎస్టీసీ-3లో హీట్ ఎఫ్జీలో 1,500 డిగ్రీల వేడి కలిగిన మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది.