అమరావతి : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కోడుమూరు గ్రామం లో భార్యపై అనుమానంతో భర్త తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి ఆటోతో సహ ప్యాలకుర్తి వద్ద కాలువలో పడేసి అక్కడి నుంచి పారి పోయాడు. ఆ సమయంలో నీరు లేకపోవడంతో ప్రమా దం తప్పింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.