అమరావతి : అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తెనాలి మండలం కొలకలూరులో తల్లి, కుమారుడు, కోడలుతో కలిసి నివాసముంటున్నా రు. ఇటీవల అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి ఒత్తిళ్లు రావడంతో వసుంధర, కిరణ్, యామిని అనే ముగ్గురు ఇవాళ పురుగుల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన వీరిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.