అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా కశింకోటలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేక విద్యుత్ కోతలు తలెత్తాయని విమర్శించారు.
ప్రజలనుదోచుకునే పద్ధతిలో పాలన కొనసాగుతుంది విరుచుకు పడ్డారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో సాగునీరందించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు.