అమరావతి : ఇది విషాద ఘటన.. భార్యాభర్తల ప్రాణాలను విద్యుత్ తీగలు బలి తీసుకున్నాయి. క్షణాల వ్యవధిలో భార్యభర్తలిద్దరూ ప్రాణాలొదిలి.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చారు.
వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని విద్యుత్ ఉద్యోగుల క్వార్టర్స్లో ఓ ఇద్దరు దంపతులు నివాసముంటున్నారు. అయితే భార్య బట్టలు ఉతుకుతుండగా, వాటిని భర్త ఆరేస్తున్నాడు. విద్యుత్ సర్వీస్ వైర్పై భర్త బట్టలు ఆరేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. అప్రమత్తమైన భార్య తన భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు యత్నించే క్రమంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇద్దరూ స్పృహ కోల్పోయారు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో.. ఇంటి వద్దనే ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.