అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల వేతనాల పెంపుదల పాత విధానం ప్రకారమే ప్రతి ఐదేండ్ల కొకసారి అమలు చేయ డానికి ఏపీ పీఆర్సీ మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసింది . సచివాలయంలో పీఆర్సీ సాధన సమితి నాయకులతో మంత్రుల కమిటీ ఉద్యోగుల సమస్యలపై మరోసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు ఉంచింది. 50వేల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10వేల సీలింగ్తో 8శాతం హెచ్ఆర్ఏ.. రెండు లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10వేల సీలింగ్తో 9.5శాతం, 5లక్షల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.12 వేల సీలింగ్లో 13.5శాతం, 10 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.15వేల సీలింగ్తో 16శాతం హెచ్ఆర్ఏ ఇస్తామని పేర్కొన్నారు. ఐఆర్ రికవరీని చేయబోమని స్పష్టం చేసిన మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. మట్టి ఖర్చుల నిమిత్తం రూ.25వేలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాత కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇస్తామని ఫిట్మెంట్ 23శాతమే ఇస్తామని మంత్రులు స్పష్టం చేశారు.