అమరావతి : శ్రావణ మాసం నాల్గవ శుక్రవారం సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు అమ్మవారి మహామండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ముత్తయిదలు పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు.
దుర్గగుడి ఈవో బ్రమరాంబ మాట్లాడుతూ అమ్మవారి చెంత వరలక్ష్మి దేవి వ్రతాలకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. దాదాపు 500 మందికి పైగా మహిళా భక్తులు వ్రతం నిర్వహించారని వెల్లడించారు.