అమరావతి : ఓ రైడీషీటర్ అంత్యక్రియల్లో జరిగిన గొడవ Football player దారుణ హత్యకు దారితీసింది. యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా చంపారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రెండురోజుల క్రితం రౌడీషీటర్ టోని హత్యకు గురయ్యాడు. అంత్యక్రియల్లో పాల్గొన్న జక్కంపూడికి చెందిన ఫుట్బాల్ ప్లేయర్ ఆకాశ్ కూడా పాల్గొన్నాడు. గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన కొందరు ఆకాశ్తో వివాదానికి పాల్పడ్డారు.
అతడిపై ఒక్కసారిగా ప్రత్యర్థులు కత్తులతో విరుచుకు పడడంతో తీవ్రంగా గాయాల పాలయ్యాడు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామ నిర్వహించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.