హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన అమర్నాథ్ను గుంటూరు జీజీహెచ్కు తరలించగా..చికిత్స పొం దుతూ మృతిచెందాడు.
అమర్నాథ్ శుక్రవారం ఉదయం ట్యూషన్కు వెళ్లి వస్తుండగా అతని స్నేహితుడు వెంకటేశ్వర్రెడ్డి మరికొందరు స్నేహితులతో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. అమర్నాథ్ సోదరిని వెంకటేశ్వర్రెడ్డి వేధిస్తున్నాడని మృతుడి తాత అన్నారు. అమర్నాథ్ నిలదీయడంతో కక్ష పెంచుకొన్నాడని ఆరోపించారు.