అమరావతి : ఏపీలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను దుకాణాల వద్ద డ్యూటీ వేసి మద్యాన్ని విక్రయించిన ఘనత జగన్దేనని విమర్శించారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు తగ్గడానికి ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు.రెండు లక్షలమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు.
టీడీపీ హయాంలో వరుసగా 95 శాతం ఉత్తీర్ణత సాధించగా నేడు ఉత్తీర్ణత ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేసి అమ్ముకుంది వూసీపీ నేతలైతే.. మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలు చేశారని అన్నారు.