అమరావతి : ఏపీలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET ) ఫలితాలను ఉన్నత విద్యా మండలి రేపు( సోమవారం) విడుదల చేయనుంది. రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఫలితాలను విడుదల చేయనున్నారు. టెట్ పరీక్ష అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు జరిగాయి. వాస్తవానికి ఈ టెట్ పరీక్ష ఆగస్టు మొదటివారం జరగాల్సి ఉండగా అభ్యర్థుల కోరిక మేరకు గడువును పొడిగించి అక్టోబర్లో నిర్వహించారు.
దీనికి సంబంధించిన ఫైనల్ కీ (Final key) ని పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 29న విడుదల చేసింది. టెట్కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈనెల మొదటివారంలో మెగా డీఎస్సీ-2024 (Mega DSC)కి నోటిఫికేషన్ ఇవ్వనుండడంతో టెట్ ఫలితాలను విడుదల చేసింది.