అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
పాఠశాలల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
1 నుంచి 9వ తరగతి వరకు విద్యా సంవత్సరం సైతం పూర్తయినట్లు వెల్లడించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు బోర్డు పరీక్షలు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పది, ఇంటర్ విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతేడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేయడంతో మిలటరీ ఉద్యోగార్థులు నష్టపోయారని మంత్రి పేర్కొన్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు ఉండవని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి