అమరావతి : ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలతో గుడివాడ పట్టణంలో టెన్షన్ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్పై కొడాలినాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ నాయకులు దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకటేశ్, వర్ల కుమారు రాజయ్య నేతృత్వంలో ఉమ్మడి కృష్ణ జిల్లాలోని 16 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు గుడివాడలోని ఒకటవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు బయలు దేరారు.
టీడీపీ కార్యాలయానికి చేరుకుంటుండగా పోలీసులు ఎక్కడికక్కడా నాయకులను అరెస్టు చేశారు.కంకిపాడు టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాహానాన్ని పోలీసులు అడ్డుకుని అతనిని అరెస్టు చేసి, ఉంగుటూరు పీఎస్కు తరలించారు. పామర్రులో స్థానిక నేతలను పోలీసులు అడ్డు కున్నారు. నిన్న దేశం నాయకులు తాడేపల్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా కొడాలి నాని ఉండే గుడివాడ పరిధి లోని ఒకటవ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేయడానికి బయలు దేరిన టీడీపీ నాయకులను అడ్డుకున్నారు.